అంతరాష్ట్ర రవాణాపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతరాష్ట్ర రవాణాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సిద్దంగా ఉంది. ఇప్పటికే తమిళనాడు కర్ణాటక తెలంగాణా సహా మరో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు కూడా రాసింది. అయితే తెలంగాణా నుంచి మాత్రం ఇప్పటి వరకు అనుమతి రాలేదు అని అధికారులు చెప్తున్నారు. 

 

ఇక చెన్నై నుంచి కూడా ఏ లేఖ రాలేదు. ఏపీలో కేసులు పెరుగుతున్నాయి  కాబట్టి దీనిపై కర్ణాటక కూడా ఏమీ స్పందించడం లేదు. దీనితో అసలు బస్సులు నడుస్తాయా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై నేటి సాయంత్రం లేదా రేపు మధ్యాహ్నం స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: