పోసాని కృష్ణ మురళి ఆదివారం రోజున ప్రెస్ మీట్ పెట్టాడు. పోసాని ప్రెస్ మీట్ అంటే అంతా కూడా ఆంధ్రప్రదేశ్  రాజకీయ విమర్శలు ఉంటాయని అంతా ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ ఇవాళ అయన ద్రుష్టి అంతా కూడా తెలంగాణ రాజకీయాలపై పడింది. ఈ ప్రెస్ మీట్ లో పోసాని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి పై విరుచుకు పడ్డాడు. రేవంత్ రెడ్డి అంత అవినీతి పరుడు ఇంకొకరు ఉండరని అయన దుయ్యబట్టారు. దేశం లో 50 లక్షల రూపాయలను ఇస్తూ పట్టుబడిన నాయకులూ దేశంలో రేవంత్ రెడ్డి తప్ప మరెవ్వరు లేరని ఎద్దేవా చేసారు.

 

ఇలాంటి అవినీతి పరుడు తెలంగాణా గొప్ప నాయకులూ అయినటువంటి కేటీఆర్ మరియు హరీష్ రావ్ లు కాళేశ్వరం విషయంలో అవినీతి చేసారంటూ చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు. కేటీఆర్ మరియు హరీష్ రావులు టిఆర్ ఎస్ ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటి వారని పొగిడారు. అదేవిధంగా వారు అవినీతి చేసారంటే ఇక్కడ ఎవరు నమ్మరని ఈ సందర్భంగా చెప్పాడు. అయితే కేటీఆర్ అవినీతి చేసినట్లు ఎవరైనా అధరాలు చూపించినట్లైతే ...నా చెంప పై కొట్టేచాన్సు వారికీ ఇస్తాను అదేవిధంగా టిఆర్ ఎస్ కి వెతిరేకంగా తాను పనిచేస్తాను అన్నట్లు వివరించాడు. కాళేశ్వరం కేసీఆర్ చిరకాల కాల కోరిక  ...దాని వల్ల ప్రజలకు మంచి జరుగుతుందని అయన ఆకాంక్షిస్తూ ఆహారాత్రులు పనిచేస్తుంటే ..మామూళ్ల కోసం ఆ ప్రాజెక్ట్ ని మొదలు పెట్టారని చెప్పడం సమంజసం కాదని అయన దుయ్యబట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: