ఆర్టీసి బస్సులు దేశ వ్యాప్తంగా మొదలయ్యాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో కూడా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ఉన్నా సరే జాగ్రత్తలు తీసుకుని బస్సులను నడుపుతున్నారు అధికారులు. ఇక ఈ తరుణంలో కొన్ని కొన్ని ఘటనలు చికాకు పెడుతున్నాయి. తిరుపతి నుంచి తిరుమలకు బస్సులను నడిపిస్తున్నారు. 

 

అయితే తిరుమల వెళ్ళడానికి బస్సుల్లో ఉద్యోగస్తులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసి బస్సుల్లో 30 మందికి మాత్రమే అనుమతి ఉన్నా సరే ఒకే బస్సులో 50 మంది వరకు ఎక్కి సీటు కోసం తోపులాటలు జరుగుతున్నాయి. రద్దీకి తగిన విధంగా బస్సులను నడపడం లేదని వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బస్సుల్లో కూడా సామాజిక దూరం పాటించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: