తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో తమిళ హీరో సూర్య తండ్రి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. డబ్బులు ఉన్న వారికే దర్శనం అంటూ ఆయన చేసిన విమర్శలు సంచలనంగా మారాయి. దీనిపై తమిళనాడు కి చెందిన ఒక వ్యక్తి ఫిర్యాదు కూడా చేసాడు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటివి కావని తేల్చారు. 

 

ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి కూడా స్పష్టం చేసారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చేసినవి కాదని విచారణలో తేలింది అన్నారు. ఇక జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసే అవకాశం లేకపోవడంతోనే టీటీడీ పై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: