ఒక పక్క డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఏపీలో సంచలనం రేపుతూ ఉండగానే మరో డాక్టర్ కథ తెరపైకి వచ్చింది. తనపై వైసీపీ నేతలు దాడి చేసారు అని మహిళా డాక్టర్ ఆరోపణలు చేసారు. డాక్టర్ అనితారాణి చిత్తూరు జిల్లా పెనుమూరులో పని చేస్తున్నారు. పెనుమూరు ఆస్పత్రిలో అన్యాయలను అడ్డుకున్నందుకు వైసీపీ నేతలతో కలిసి కొంతమంది సిబ్బంది తనపై కుట్ర చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. 

 

మార్చి 22న ఆస్పత్రిలో తనను వైసీపీ నేతలు బంధించారని ఆమె పేర్కొన్నారు. తనను డిప్యూటీ సీఎం నారాయణస్వామి వేధిస్తున్నారని మండిపడ్డారు. తనపై కక్షతోనే చిత్తూరుకు డిప్యూటేషన్‌పై పంపారన్న ఆమె... 2నెలలు గడుస్తున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కన్నీటి పర్యంతం అయ్యారు ఆమె. ఈ మేరకు హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: