కేంద్రం వలనే దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా కేసులు పెరిగిపోయాయి అని అక్కడి ప్రభుత్వం ఆరోపించింది. అసలు విమానాలు ఆపేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఢిల్లీ వాసులకే ఇక్కడి ఆస్పత్రులు అంటూ కేజ్రివాల్ చేసిన ప్రకటనపై విమర్శలు రావడంతో సమాధానం ఇచ్చారు. 

 

సకాలంలో అంతర్జాతీయ విమానాలను కేంద్రం నిలిపేసి ఉంటే ఢిల్లీలో పరిస్థితి మరితం మెరుగ్గా ఉండేదన్నారు ఆయన. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఢిల్లీ వాసులకు మరిన్ని ఆసుపత్రుల అవసరం ఉందని స్పష్ట౦ చేసారు. పొరుగు రాష్ట్రాలు తమకు తక్కువ కేసులు ఉన్నాయని చెప్పినప్పుడు ఇంక సమస్య ఏముంటుందని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: