చిత్తూరు జిల్లాలో డాక్టర్ అనితా రాణి విషయంలో వైసీపీ నేతలు అనుసరించిన వైఖరిపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె తనను మంత్రి నారాయణ స్వామి ఇబ్బంది పెడుతున్నారు అని ఆరోపణలు కూడా చేస్తూ హైకోర్ట్ కి కూడా వెళ్ళారు. ఈ నేపధ్యంలోనే సిఎం వైఎస్ జగన్ ఈ వ్యవహారంపై స్పందించారు. 

 

డాక్టర్ అనితా రాణి వ్యవహారాన్ని ఆయన సిఐడీ కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజా నిజాలు తేల్చాలి అని ఆయన ఆదేశాలు ఇచ్చారు. చిత్తూరు జిల్లా పెనుమూరు ఆస్పత్రిలో ఆమె విధులు నిర్వహిస్తున్నారు. తన మీద కొందరు వైసీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: