దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా వేగంగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి గాని తగ్గడం లేదు.  ప్రతీ రాష్ట్రంలో కూడా కరోనా తీవ్రత ఎక్కువగానే ఉంది. ఇక ఇదిలా ఉంటే రాజస్థాన్ లో ఒకే కుటుంబంలో 27 మందికి కరోనా సోకిందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. 

 

ఏడు రోజుల క్రితం, జైపూర్ లో ఒక వ్యక్తికి పరిక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని వచ్చింది. అతని కుటుంబం మొత్తానికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాము రోగిని వేరుచేసి, రోగి కుటుంబంలోని మొత్తం 26 మంది సభ్యుల నమూనాలను తీసుకున్నామని... గత రాత్రి వారి నివేదిక వచ్చిందని... అందరి ఫలితాలు పాజిటివ్ అని వచ్చాయి అని వారిని ఆసుపత్రికి తరలించారని డాక్టర్ నరోత్తం శర్మ మీడియాకు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: