కర్నూలు జిల్లాలో ఒక ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకుడికి కొందరు షాక్ ఇచ్చారు. అతని ఇంట్లో ఏటీఎం కార్డు ని దొంగతనం చేసి 14 లక్షలను మాయం చేసారు. వివరాల్లోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోనిలో ఆస్పత్రి నిర్వహిస్తున్న మధుసూదన్‌ దేశాయ్‌ ఇంట్లో ఏటీఎం కార్డు పోయింది. అతని భార్య కల్పనా పేరుతో కర్ణాటక బ్యాంకు లో ఎకౌంటు ఉండగా.. ఈ బ్యాంకు ఇచ్చిన ఏటీఎం కార్డ్ గత ఫిబ్రవరిలో పోయింది. 

 

వారి ఇంట్లోనే కనపడకుండా పోవడంపై ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. ఇక ఫిబ్రవరి 23 నుంచి వారి ఖాతాలో ఉన్న డబ్బుని ఆన్‌లైన్‌లో వస్తువుల కొనుగోలు ఆన్‌లైన్‌ ద్వారా దొంగలు రూ.14 లక్షలను కాజేశారు. తమ ఏటీఎం కార్డు పోయినట్లు ఈ నెల 7 న పోలీసులకు ఫిర్యాదు చేసాడు దేశాయ్. ఏటీఎం కార్డు కవర్ లోనే పిన్ ఉందని అందుకే నగదు పోయాయి అని అధికారులు పేర్కొన్నారు. మరి అప్పుడు పోతే ఇప్పుడు ఏ విధంగా ఫిర్యాదు చేసారు అనేది ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: