మహారాష్ట్రకు తెలంగాణకు మధ్యప్రదేశ్ కు తప్పిన మిడతల ముప్పు రాజస్థాన్ కి చుక్కలు చూపిస్తుంది. ఆ రాష్ట్రంలో మిడతల దండు ఇప్పుడు ప్రజలకు నరకం చూపిస్తుంది. రాజస్థాన్ లోని మిడతల దండు బార్మెర్ జిల్లాలో పంటలను దెబ్బతీస్తున్నాయని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

దీనిపై మాట్లాడిన జిల్లా కలెక్టర్ విశ్రమ్ మీనా... ఈ మిడుతలు గులాబీ రంగులో ఉంటాయని పేర్కొన్నారు. ఇవి వేగంగా ఎగురుతాయని ఆయన పేర్కొన్నారు. వాటిని నియంత్రించడంలో 50% నుండి 60% విజయాలు సాధించామని కాని అవి మాత్రం ఆగడం లేదని పంటలు నష్టపోయి రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు. అయితే, మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నామని ఆయన మీడియాకు వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: