మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఒక తండ్రి తన కొడుకుని అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జిల్లాలోని హాజిపూర్ మండలం రాపల్లి గ్రామంలో ఒక కుటుంబంలో గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలోనే గత కొన్ని రోజులుగా ఇవి తీవ్రమవుతూ వచ్చాయి. 

 

దీనితో తండ్రి దుర్గం ప్రసాద్ (40)ను అతని కొడుకు దుర్గం ప్రమోద్ రాజ్(19) గొడ్డలితో అత్యంత పాశవికంగా దాడి చేసి చంపేసాడు. ఈ దాడిలో గాయపడిన ప్రసాద్ అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్తానికలు అందించిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకుని రిమాండ్ కి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: