సినీనటి కుష్బూ ఇటీవలే తన స్నేహితులతో మీడియా గురించి నెగిటివ్ కామెంట్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చేస్తూ ఏకంగా కూర్చొని విమర్శల పాలు చేసిన విషయం తెలిసిందే, దీంతో ఈ విషయంపై తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది కుష్బూ . తన వాయిస్ ని ఎడిట్ చేసి వీడియో ని వైరల్ చేశారంటూ ఆరోపించింది.
ప్రస్తుతం పాత్రికేయులకు కరోనా వైరస్ వార్తలు తప్ప వేరే వార్తలు లేవని ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదలు కావడంతో కొత్త వార్తలు అల్లి మరి వాటి గురించి రాయడానికి సిద్ధపడుతున్నారు అంటూ ఆ వీడియోలో ఉన్నది.. ఇక తాజాగా ఈ మీడియో పై తనకు ఎంత గౌరవం ఉందని... ఈ విషయం జర్నలిస్టులకు కూడా తెలుసు అంటూ చెప్పుకొచ్చింది. మీడియా గురించి తాను అగౌరవంగా మాట్లాడలేదని... తన వల్ల ఎవరైనా బాధపడినట్లు అయితే క్షమాపణలు చెబుతున్నా అంటు తెలిపింది . అయితే తాను పత్రికలు ఆగౌరవ పరచలేదని... ఈ పని ఏ నిర్మాత చేశారో తనకు తెలుసు అంటూ చెప్పుకొచ్చిన కుష్బూ అతని పేరు మాత్రం చెప్పలేదు.