దేశ వ్యాప్తంగా ఇప్పుడు అడవి జంతువుల సందడి మొదలయింది. పలు ప్రాంతాల్లో చిరుత పులులు ఎక్కువగా సంచరిస్తూ ప్రజలను కాస్త ఎక్కువగానే భయపెడుతున్నాయి. తాజాగా  గుజరాత్ లో  ఒక చిరుత పులి బావిలో పడిపోయింది. గుజరాత్ రాష్ట్రంలోని ఉదేపూర్ జిల్లాలోని రన్వాడ్ గ్రామంలో ఒక చిరుతపులి బావిలో పడిపోయిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు.

 

అక్కడి ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అని దానిని తాము బయటకు తీసుకు రావడానికి ప్రయత్నాలు చేసామని... అవి ఫలించాయి అని అధికారులు పేర్కొన్నారు. తరువాత దానిని అడవిలో వదిలిపెట్టారు అధికారులు. ఈ ఘటనలో దానికి స్వల్ప గాయాలు అయ్యాయి అని నీళ్ళు తాగడానికి వచ్చి అది బావిలో పడిందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: