భారత్ లో ఐపిఎల్ మ్యాచ్ లు నిర్వహించే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది.  తాజాగా దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు గంగూలి స్పందించారు. ఖాళీ స్టేడియం లో ఐపిఎల్ ని నిర్వహించడానికి గానూ తాము కసరత్తులు చేస్తున్నామని అన్నారు. దీనిపై చర్చలు జరుగుతున్నాయని రెండు మూడు రోజుల్లో నిర్ణయం ఏంటీ అనేది చెప్తామని ఆయన వ్యాఖ్యానించారు. 

 

అభిమానులు, ఫ్రాంఛైజీలు, ఆటగాళ్ళు, చానల్స్ , స్పాన్సర్‌లు మరియు వాటాదారులు ఈ సంవత్సరం ఐపిఎల్‌ కోసం ఎదురు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఐపిఎల్ ని నిర్వహించడానికి తాము సిద్దంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాల ఆటగాళ్ళు కూడా ఐపిఎల్ ఆడటానికి ఆసక్తిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: