ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలు చేసారు. జగన్ పాలన లక్ష్యంగా ఆయన ఈ ఆరోపణలు చేసారు. జ‌గ‌న్‌ పాల‌న‌లో కొత్త ఉద్యోగాలు దేవుడెరుగని.. ఉన్న ఉద్యోగాలే పీకేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

 

ఎంతో మందికి అండగా నిలిచిన ప్రజా వేదికను 1100 కాల్ సెంట‌ర్‌ని నిర్వీర్యం చేసి తన బంధువుకు కాంట్రాక్ట్ కట్టబెట్టారని ఈ సందర్భంగా ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల కోసం 2,200 మందిని ఉద్యోగాల్లోంచి తీసేశారని ఈ సందర్భంగా లోకేష్ ఆరోపించారు. 1100ని 1902గా మార్చారన్న ఆయన.. నిరుద్యోగ భృతి ఎత్తేశారని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు. కార్యకర్తలకు ఉద్యోగాల పేరుతో వేల‌ మందిని రోడ్డున ప‌డేశారని ఆరోపణలు చేసారు

మరింత సమాచారం తెలుసుకోండి: