ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాసారు. రాష్ట్రంలో ఫొటోగ్రఫీ వృత్తిగా చేసుకుంటున్న ఫొటో/వీడియోగ్రాఫర్లకు తక్షణమే రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు చేపట్టాలి అంటూ ఆయన లేఖలో విజ్ఞప్తి చేసారు. 

 

కరోనా విపత్కర కాలంలో పనులు లేక గత 3 నెలలుగా ఫొటో/వీడియోగ్రాఫర్లు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని లేఖలో ఆవేదన వ్యక్తం చేసారు. లాక్‌డౌన్ వల్ల ఉపాధి కరవై ఫొటో/ వీడియో గ్రాఫర్ల కుటుంబాలు అగమ్య గోచరంలో ఉన్నాయని ఆయన లేఖలో సిఎం కి వివరించారు. ఛాయా చిత్రకారులను ఆదుకునేందుకు గానూ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తగిన నిధులు కేటాయించవలసిందిగా కోరుతున్నట్లు ఆయన లేఖలో సిఎం జగన్ ని విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: