ఈఎస్ఐ అక్రమాల విషయంలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. తాజాగా కీలక వ్యక్తులను వారు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ... సీకే రమేష్ , జి.విజయకుమార్, డాక్టర్ జనార్దన్, ఈ. రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వీరు అందరిని కూడా సాయంత్రం కోర్ట్ లో ప్రవేశ పెట్టే అవకాశం ఉంది అని సమాచారం. 

 

మరి కొంత మంది నేతలను కూడా టీడీపీకి సంబంధించి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వ్యవహరం లో 40 మంది పాత్ర ఉంది అని అధికారులు చెప్తున్నారు. వారిని కూడా అదుపులోకి తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. దీనిపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: