టీడీపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ పై టీడీపీ సీనియర్ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత యరపతనేని శ్రీనివాసరావు స్పందించారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ దుర్మార్గపు చర్య అని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని ఈ సందర్భంగా యరపతనేని మండిపడ్డారు. 

 

అసెంబ్లీలో గళం విప్పుతాడనే జగన్ భయపడ్డారని ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు. ఒక్క ఎమ్మెల్యేకే భయపడే జగన్.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడని  ఈ సందర్భంగా నిలదీశారు. ఇప్పటి వరకు దళితులకే పరిమితమైన దాడులు.. ఇప్పుడు బీసీలపైనా ప్రారంభమయ్యాయని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. బీసీలు తిరగబడితే జగన్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: