మృతదేహాల విషయంలో మానవత్వంగా ఉండాలని పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జికి గవర్నర్ జగ్దీప్ ధన్‌ఖర్ సూచించారు. కుళ్లిపోయిన శవాలను ఈడ్చుకుంటూ వ్యానులో పడేస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. దీనిపై ఆయన స్పందిస్తూ మమత పై వ్యాఖ్యలు చేసారు. కేఎంసీ చైర్‌పర్సన్, మున్సిపల్ కమిషనర్‌తో దీనిపై అత్యవసర సమావేశానికి ఆయన సిద్దమయ్యారు. 

 

ఈ సందర్భంగా మాట్లాడుతూ మృత దేహాలను ఏమాత్రం కనికరం లేకుండా ఈడ్డుకుంటూ తీసుకెళ్లి వ్యానులో పడేస్తున్న వీడియో చాలా ఆవేదన కలిగించిందన్నారు ఆయన. పోలీసుల చర్య సమంజసంగా లేదని వ్యాఖ్యానించారు. మన సంస్కృతిలో మరణించిన వారిని ఎంతో గౌరవంతో చూస్తామని... ఇందుకు భిన్నంగా జరుగుతుండటం చాలా సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: