తెలంగాణ చరిత్రను గురించి తెలియజేస్తూ మరియు ప్రకృతి రమణీయతను వివరిస్తూ పడిన గీతం తెలంగాణ తల్లి ప్రార్థన గీతం. ఈ గీతాన్ని రచించినది ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు. తెలంగాణ లోని యావత్ రమణీయతను ,కళలను మరియు తెలంగాణ సంపదను వివరిస్తూ ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు ఈ గీతాన్ని ఆద్బుతంగా రచించారు.
ఈ గీతాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ విడుదల చెశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు రచించిన తెలంగాణ తల్లి ప్రార్థన గీతం ను విడుదల చేసే అవకాశం వచ్చిందని మంత్రి కేటీఆర్ గారు తన ట్విట్టర్ ఖాతాలో వివరిస్తూ పోస్ట్ చెశారు.
ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు రచించిన తెలంగాణ తల్లి ప్రార్థన గీతాన్ని విడుదల చేసే అవకాశం లభించింది ఈ రోజు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, శిల్ప కళను గురించి వర్ణించే ఈ పాట మనసుని హత్తుకుంది.
— ktr (@KTRTRS) June 12, 2020
https://t.co/vaE1LRiiTG pic.twitter.com/IvnUPZPUvG