దేశంలో కరోనా సామాజిక వ్యాప్తి మొదలైందా...? అంటే అవుననే  అంటున్నారు నిపుణులు. తాజాగా కొందరు మాట్లాడుతూ ఇప్పుడు దేశంలో కరోనా వ్యాప్తి  ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం సామాజిక వ్యాప్తి అని అందుకే కేసులు ఈ స్థాయిలో నమోదు అవుతున్నాయి అని అంటున్నారు. ఈ విషయంలో  కేంద్రం అంగీకరించడం లేదు అని... కాని కరోనా మాత్రం వేగంగా విస్తరించడానికి అదే ప్రధాన కారణమని చెప్తున్నారు. 

 

తమిళనాడు మహారాష్ట్ర ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా సామాజిక వ్యాప్తి మొదలయింది అని వ్యాఖ్యానిస్తున్నారు. ఇది గనుక ఇదే విధంగా ఉంటే మాత్రం కరోనాను కట్టడి చేయడం అనేది సాధ్యం అయ్యే పని కాదని ఇప్పటికైనా కేంద్రం కఠిన నిర్ణయాలకు సిద్దం కావాలి అని పలువురు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: