నేరాలకు బీసీలకు సంబంధం ఏంటీ అని స్పీకర్ తమ్మినేని సీతారాం నిలదీశారు. కాసేపటి క్రితం ఆయన టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు అరెస్ట్ పై మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అచ్చెన్నాయుడు ఏమైనా స్వాతంత్ర్య సమరయోదుడా అని ఆయన నిలదీశారు. ఏమైనా కార్గిల్ యుద్దంలో పాల్గొన్నాడా అంటూ ఎద్దేవా చేసారు. 

 

అసలు బీసీలకు నేరాలతో ఎందుకు లింక్ లు పెడుతున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. నేరాలకు బీసీలకు లింక్ పెడుతూ రాజకీయాలు చేస్తున్నారు అని స్పీకర్ ఆరోపణలు చేసారు. వందల కోట్ల రూపాయలను దారి మళ్ళించారు అని ఆయన ఆరోపించారు. రాజకీయం కోసం బీసీలను అవమానించడం సరికాదన్నారు స్పీకర్. అచ్చెన్నాయుడు దేవుడు కాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: