కేరళలో కరోనా కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. ప్రతీ రోజు కూడా దాదాపు వంద వరకు కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి అక్కడ చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం కనపడటం లేదు అనే చెప్పాలి. ఇక త్రిశూర్ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో గురువాయూర్ పట్టంలో ఉన్న శ్రీ కృష్ణ దేవాలయాన్ని శనివారం నుంచి మూసి వేసారు అధికారులు. 

 

ఈ నేపధ్యంలో గురువారం శ్రీ కృష్ణ ఆలయంలో దర్శనంతో పాటుగా వివాహాలను కూడా నిలిపివేయాలి అని ఆదేశాలు ఇచ్చారు అధికారులు. శనివారం నాటికి బుక్ చేసుకున్న రెండు వివాహాలకు మాత్రం అనుమతి ఉంటుందని మంత్రి ఒకరు మీడియాతో చెప్పారు. ఇతర వివాహాలకు అనుమతి ఉండదు అని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: