అసలే కరోనా కష్ట కాలంలో సామాన్యుడికి పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంలో మరింత భారం పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు గత వారం నుంచి పెరుగుతున్నాయి. వరుసగా ఎనిమిదో రోజు పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి.
పెరిగిన ధరలు ఒకసారి చూస్తే, దేశ రాజధాని ఢిల్లీలో రూ.74.03 నుంచి రూ.75.78 పెరిగింది. అదే విధంగా ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ. 83.7, చేరుకుంది. అదే విధంగా, కోల్కతాలో, పెట్రోల్ ధర 77.64 రూపాయలకు పెరిగింది. ఒక లీటరు డీజిల్ ధర 69.80 వద్ద స్థిరంగా ఉంది. లాక్ డౌన్ సమయంలో ఈ ధరలు సామాన్యులకి మరింత భారం కానున్నాయి.