ఢిల్లీ లో కరోనా కట్టడికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి గానూ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా కేసులు ఢిల్లీ లో భారీగా పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆ రాష్ట్ర సిఎం అరవింద్ కేజ్రివాల్ తో సమావేశం అయ్యారు. 

 

అలాగే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనీల్ బైజాల్ తో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఢిల్లీ కి ప్రత్యేక వైద్య బృందాలను విదేశాల నుంచి పిలవాలి అని కేజ్రివాల్ అమిత్ షాను కోరినట్టు తెలుస్తుంది. దీనికి అమిత్ షా కూడా సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ కూడా  పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: