టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ లో నటించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు.  ముంబై లోని బాంద్రాలో తన నివాసంలో సుశాంత్ ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు అని  బాలీవుడ్ వర్గాలు. అతను ఆత్మహత్యకు పాల్పడటానికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడే అని తెలుస్తుంది. 

 

ప్రేమ వ్యవహారంలో అతను ఒత్తిడి లో ఉన్నాడు అని అందుకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలుస్తుంది. అతని మరణంతో ఒక్కసారిగా బాలీవుడ్ షాక్ అయింది. ఇప్పటికే ఈ ఏడాది ఇర్ఫాన్ ఖాన్ సహా రిషీ కపూర్ ని కోల్పోయిన బాలీవుడ్ ఇప్పుడు ఈ విధంగా మరో నటుడ్ని కోల్పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: