త్వరలో మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాస్ ని కూడా అరెస్ట్ చేస్తారు అని గురజాల ఎమ్మెల్యే mahesh REDDY' target='_blank' title='కాసు మహేష్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కాసు మహేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పాలనలో పల్నాడుకు చేసింది శూన్యం అని ఆయన ఆరోపించారు. పల్నాడుకు ఒక్క ప్రాజెక్టు అయినా తెచ్చామని టీడీపీ నేతలు చూపించగలరా? అని నిలదీశారు. 

 

సరస్వతి సిమెంట్‌కు మైనింగ్ లీజ్‌లు పునరుద్ధరించమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్న ఆయన... సరస్వతి లీజును ఎలా ఆపాలా అని బాబు కుట్రలు చేస్తున్నారని ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేసారు. వెనుకబడిన మాచవరం మండలంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు ఆయన. ఏసీ రూముల్లో కూర్చుని యరపతనేని ప్రెస్ మీట్ లు పెట్టి తిడుతున్నారు అంటూ ఆయన ఆరోపణలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: