మహారాష్ట్రలో ఇప్పుడు కరోనా పోలీసులను వెంటాడుతుంది. రోజు రోజుకి పోలీసుల్లో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజు కూడా మహారాష్ట్రలో పోలీసులకు కరోనా సోకడంతో ఇప్పుడు అక్కడ విధులు నిర్వహించే పోలీసులు భయపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని థానే లో మొత్తం 269 మంది పోలీసులకు కరోనా  సోకింది అని అధికారులు వెల్లడించారు. ఇక వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు అని పోలీస్ శాఖ పేర్కొంది. 

 

మహారాష్ట్రలోని పాల్ఘర్ పట్టణంలో ఆదివారం మరో ఇద్దరు పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. మొత్తం అక్కడ 50 మంది పోలీసులకు కరోనా సోకింది. ప్రస్తుతం థానే లో 80 మంది పోలీసుల్లో కరోనా యాక్టివ్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: