బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై ఇప్పుడు సినీ ప్రముఖులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. సోషల్ మీడియా లో అతని గురించి పోస్ట్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసాడు. సుశాంత్ సింగ్ మరణం అనేది పదాలతో వర్ణించలేని బాధ అని మహేష్ అన్నాడు. 

 

అతని ఆత్మ శాంతించాలి అని మహేష్ పేర్కొన్నాడు. అతని కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసాడు. ఇక రామ్ చరణ్ కూడా దీనిపై ట్వీట్ చేసాడు. అద్భుతమైన ప్రతిభ త్వరగానే వెళ్లిపోయింది అని పేర్కొన్నాడు. ఈ మరణ వార్త తనను షాక్ కి గురి చేసిందని చెప్పాడు. అతని కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: