ప్రగతి భవన్ లో తెలంగాణా సిఎం కేసీఆర్ అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి మంత్రి ఈటెల రాజేంద్ర, అలాగే ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో కరోనా నియంత్రణ లాక్ డౌన్ పై ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. ఇక తెలంగాణాలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ పై ఏదోక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

 

కేసులు భారీగా పెరుగుతున్న హైదరాబాద్ లో లాక్ డౌన్ ని విధించే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది. రోజు రోజుకి అక్కడ కేసులు పెరుగుతున్నాయి. ఇక రేపు సోమవారం కావడంతో నేడు లాక్ డౌన్ పై ఆయన ఏదోక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: