బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంకి సంబంధించి ఇప్పుడు పోలీసులు విచారణ వేగవంతం చేసారు. అతని కుటుంబ సభ్యులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే అతని మరణానికి సంబంధించి పోలీసులు కీలక వ్యాఖ్యలు చేసారు. అతని ఇంట్లో అతను వాడే మందులను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 

 

ఇక అతని వద్ద అనుమానాస్పద వస్తువులు గాని మరొకటి గాని దొరకలేదు అని, సూసైడ్ లెటర్ కూడా లేదు అని ముంబై 9 వ జోన్ డీసీపీ అభిషేక్ త్రిముఖే వెల్లడించారు. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఉరి కారణంగా మరణించాడని స్పష్టంగా తెలుస్తుంది కాని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే అతని మరణానికి ఖచ్చితమైన కారణాన్ని పోలీసులు చెప్పగలరని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: