ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర ప్రాంతాలకు బస్సులను నడపాలి అని ఏపీఎస్ ఆర్టీసి నిర్ణయం తీసుకుంది. కర్ణాటక రాజధాని బెంగళూరు కి బస్సులు నడపడానికి గానూ ఏపీఎస్ ఆర్టీసి నిర్ణయం తీసుకుంది. విజయవాడ బస్టాండ్ నుంచి 10 బస్సులు ఇతర ప్రాంతాల నుంచి 40 బస్సులను నడపాలి అని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. 

 

ఇక తమిళనాడు రాజధాని చెన్నై కి బస్సులు నడపాలి అని భావించినా అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అదే విధంగా హైదరాబాద్ బస్సులు నడపాలి అని భావించినా సరే తెలంగాణా సర్కార్ అంగీకరించలేదు. అధికారులు ఇప్పటికే లేఖలు కూడా రాసినా సరే తెలంగాణా నుంచి స్పందన రాలేదు. త్వరలోనే రాష్ట్రాల స్పందన ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: