ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ టీడీపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సభ నుంచి వాకౌట్ చేసారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మధ్య సమన్వయ లోపం బాగా స్పష్టంగా కనపడింది అని చెప్తున్నారు. 

 

ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చేశారు. కాని ఎమ్మెల్సీలు మాత్రం సభ నుంచి బయటకు రాలేదు. దీనితో అసలు ఎం జరుగుతుంది అనేది కాసేపు అర్ధం కాలేదు. అటు బిజెపి వైసీపీ ఎమ్మెల్సీ లు దీని గురించి చర్చించుకుంటున్నారు. అసలు గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సమ్మతి౦చినట్టా లేక వ్యతిరేకి౦చి౦దా అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: