యేరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్లు ఉంది నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యవహారం అని  మంత్రి శ్రీరంగనాద రాజు అన్నారు. జగన్ ఫోటో లేకపోతే నువ్వు ఎంపీ అయ్యే వాడివా అంటూ ఆయనను ప్రశ్నించారు. రఘురామ కృష్ణం రాజు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. సిఎం కి వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన వ్యవహారం చర్చకు వచ్చింది. 

 

నర్సాపురం లో కరోనా నియంత్రణ ను రఘురామా కృష్ణం రాజు పట్టించుకోలేదు అని ఆయన ఆరోపించారు. అన్ని కులాలకు సిఎం జగన్ న్యాయం చేస్తున్నారు అని మంత్రి అన్నారు. సామాజిక వర్గాలను రెచ్చగొడుతున్నారు అని అనడం తప్పు అని వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: