కొంత మందిలో మానవత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది అనే వ్యాఖ్యలను అప్పుడప్పుడు వింటూ ఉంటాం. కనీసం మనుషులు అనే విషయాన్ని కూడా కొందరు మర్చిపోతూ ఉంటారు. తాజాగా జరిగిన ఒక సంఘటన సంచలనంగా మారింది. అల్లరి చేస్తున్నారన్న కారణంతో బెంగాల్ రాజధాని కలకత్తాలోని బుర్జా బజార్ ప్రాంతంలో 55సంవత్సరాల ఓ వ్యక్తి ఇద్దరు చిన్నారులను అపార్టుమెంటులోని 4వ అంతస్తు నుంచి కింద పడేసాడు. 

 

ఓ చిన్నారి ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి మరణించగా మరో చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేయగా తాను వాళ్ళ అల్లరి తట్టుకోలేక ఆ పని చేశా అని చెప్పాడు. కావాలని తాను విసరలేదు అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: