భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చైనా ఆర్మీ భారత్ ని దొంగ దెబ్బ తీసిన సంగతి తెలిసిందే. గస్తీ కాస్తున్న భారత జవాన్లపై ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ ఘటనపై ఇప్పుడు కేంద్ర సర్కార్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. చైనా అర్మీని ఎలా అయినా సరే కట్టడి చెయ్యాలి అని భావిస్తుంది. 

 

దీనితో భారత్ చైనా సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొంది. చైనా ఆర్మీని ఎదుర్కోవడానికి గానూ భారీగా బలగాలను మోహరించింది ఇండియన్ ఆర్మీ. దీనితో చైనా కూడా అదే స్థాయిలో స్పందిస్తుంది. భారీగా యుద్ద సామాగ్రిని భారత సరిహద్దులకు చైనా తరలిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: