సరిహద్దుల్లో చైనా ఆర్మీ జరిపిన కాల్పుల్లో 20 మంది భారత జవాన్ లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఒక్కసారిగా యావత్ దేశం కూడా చైనాపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఇక తెలంగాణా రాష్ట్రానికి చెందిన సంతోష్ బాబు అనే కల్నల్ స్థాయి అధికారి సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయారు. 

 

దీనితో ఇప్పుడు ఆ కుటుంబం లో విషాద చాయలు అలముకున్నాయి. ఈ నేపధ్యంలో మీడియా సంతోష్ బాబు తల్లిని పలకరించగా తన కొడుకు దేశం కోసం మరణించాడు అని దానికి గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. తనకు ఒక్కడే కొడుకు అని తన కోడలు ఢిల్లీ లో ఉంటున్నారు అని వారికి అధికారులు సమాచారం ఇచ్చారు అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: