ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ విషయంలో ఏపీ సర్కార్ ముందుకి వెళ్తున్న నేపధ్యంలో రాజధాని గ్రామాల్లో మరోసారి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని గ్రామాలకు చెందిన రైతులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలోనే భారీగా రాజధాని గ్రామాల్లో పోలీసులు మొహరించారు. 

 

అసెంబ్లీ సమావేశాల నేపధ్యంలో ఎటు వంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి గానూ రాజధాని గ్రామాల్లో భారీగా పోలీసులు మొహరించారు. ఇక మూడు రాజధానులు వద్దు ఒక రాజధాని ముద్దు అంటూ గ్రామాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు అక్కడి రైతులు. కాగా నిన్న గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల అంశాన్ని చేర్చడంపై ఇప్పుడు 29 గ్రామాల రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం వెనక్కు తగ్గాలి అని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: