మూడు నెలల క్రితం పీపీఈ కిట్ ల కొరత ఉందని కాని ఇప్పుడు అది లేదన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లే కరోనా వ్యాప్తిని తగ్గించగలిగామని అన్నారు ఆయన. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఉన్న కరోనా రోగుల కంటే కూడా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 

 

ఆసుపత్రుల్లో ఉన్న వారిలోనూ అతి తక్కువ మందికి మాత్రమే వెంటిలేటర్లు, ఐసీయూలు అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్లనే కరోనాపై పోరాటం చేసామని అన్నారు. వ్యాప్తిని సాధ్యం అయినంత మేర తగ్గించినట్టు వివరించారు. భారత్ పీపీఈ కిట్ లను బాగా ఉత్పత్తి చేస్తుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: