దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. దీనితో ఆ రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలను ఎక్కువగా చెయ్యాలి అని నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూ వస్తున్న నేపధ్యంలో పరిక్షల సంఖ్యను పెంచడమే మార్గం అని నిర్ణయానికి వచ్చింది. కేంద్రం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అదే విషయం స్పష్టం చేసింది. 

 

దీనితో కరోనా పరీక్షలను ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచింది. నిన్న ఒక్క రోజే ఢిల్లీ లో 20 వేల కరోనా పరిక్షలు నిర్వహించారు అధికారులు. ఇక ఢిల్లీ లో కేసులు 50 వేలకు చేరుకున్నాయి. వేల కేసులు నమోదు కావడంపై అటు కేంద్రం కూడా చర్యలకు సిద్దమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: