ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. నాలుగు రాజ్యసభ స్థానాలకు గానూ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తొలి ఓటును సిఎం జగన్ వినియోగించుకున్నారు. అలాగే ఇప్పటి వరకు 136 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 

రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐదుగురు అభ్యర్థులు ఆయా స్థానాలకు పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలకు ఓటు ఏ విధంగా వెయ్యాలి అనే దాని మీద పార్టీ నేతలు దిశా నిర్దేశం చేసారు. వైసీపీ నుంచి పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి, అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ల నత్వాని బరిలో ఉండగా టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యేలకు విజయసాయి రెడ్డి నిన్న శిక్షణ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: