తమిళనాడు లో కరోనా తీవ్రత దెబ్బకు రాష్ట్రం మొత్తం కూడా షేక్ అవుతుంది. ప్రజల నుంచి ప్రముఖుల వరకు కూడా అందరూ ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. అసలు సామాన్యులే భయపడే కరోనా ఇప్పుడు రాజకీయ ప్రముఖులాకు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అనేది వాస్తవం. అధికార విపక్షాలకు చెందిన నేతలు కరోనా బారిన వరుసగా పడుతున్నారు. 

 

తాజాగా ఆ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి కరోనా బారిన పడ్డారు. ఈ నేపధ్యంలో ఆ రాష్ట్ర విపక్ష పార్టీ అయిన డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ఫోన్‌లో ఆ మంత్రి ఆరోగ్య పరిస్థితిని అడిగి స్వయంగా తెలుసుకున్నారు. ఆయనకు ఫోన్ చేసి మళ్ళీ ప్రజల్లోకి వేగంగా రావాలి అంటూ ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: