భారత్ చైనా ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో ఇప్పుడు  భారత్ లో చైనా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. చైనా అధ్యక్షుడి చిత్ర  పటాన్ని కూడా ధహనం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో అయితే చైనా వస్తువులను అమ్మకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. ఇక తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆ రాష్ట్ర ప్రజలకు ఒక పిలుపు ఇచ్చారు. 

 

చైనాలో తయారైన ఉత్పత్తులను బహిష్కరించాలని మధ్యప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు ఆయన. మన సైన్యం వారికి తగిన సమాధానం ఇస్తుంది కాని మన౦ వారిని ఆర్థికంగా కూడా దెబ్బ తీయాలి అంటూ సిఎం తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఒక ప్రకటన చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: