ఢిల్లీ ఆరోగ్య శాఖా మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడింది. ఆయనకు ప్లాస్మా చికిత్స చేయడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి  మెరుగు పడినట్టు వార్తలు వస్తుంది. మంత్రి సత్యేందర్ జైన్ కు ప్లాస్మా థెరపీ ఇచ్చారని అధికారులు పేర్కొన్నారు. 

 

అతనికి ఇప్పుడు జ్వరం లేదని ఆరోగ్యం కాస్త కుదుట పడింది అని ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాబోయే 24 గంటల్లో ఆయనను ఐసియు లోనే ఉంచి పరిశీలిస్తామని వైద్యులు కూడా పేర్కొన్నారు. ఆయనకు ఈ నెల 17 న కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక నిన్న ఆయన తీవ్ర న్యుమోనియా తో బాధ పడటం తో ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: