ఆంధ్రప్రదేశ్ లో రెండో విడత నేతన్న హస్తం కార్యక్రమానికి సిఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో ఈ కార్యక్రమం ద్వారా 81 వేల 24 మందికి లబ్ది చేకూరుతుంది. మగ్గం ఉన్న ప్రతీ ఒక్కరికి కూడా 24 వేలు అందిస్తారు. కరోనా కారణంగా ఆరు నెలల ముందుగానే ఈ సహాయం అందిస్తుంది ఏపీ సర్కారు. 

 

సిఎం జగన్ మాట్లాడుతూ పాదయాత్రలో తాను నేతన్న లు పడుతున్న కష్టం చూసాను అని, ప్రతీ నేతన్న ను తాను ఆధుకుంటాను అని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఉంచిన బకాయిలను కూడా తాను చేల్లిస్తాను అని స్పష్టం చేసారు. మార్కెట్ లేక ముడి సరుకులు లేక ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: