ఈ మధ్య కాలంలో దొంగతనాలు కూడా చాలా తెలివిగా చేస్తున్నారు. తాజాగా ఒక క్యాషియర్ గర్ల్ ఫ్రెండ్ సహాయంతో 15 కేజీల బంగారం కొట్టేసిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో  ఎస్‌బీఐ బ్రాంచిలో 15 కిలోల బంగారం పోయింది అని కేసు నమోదు అయింది. గోల్డ్ లోన్ ‌లాక‌ర్ నుంచి 101 ప్యాకెట్ల బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి అని బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు చేసారు. 

 

దీనితో విచారణ మొదలుపెట్టగా క్యాషియర్ తన స్నేహితుడు నవీన్, గ‌ర్ల్‌ ఫ్రెండ్‌ జ్యోతితో కలిసి బంగారం దొంగతనం చేసాడని విచారణలో వెల్లడి అయింది. మొత్తం వారి నుంచి మూడు కిలోల బంగారం 11 లక్షల నగదు స్వాధీనం చేసుకుని, అరెస్ట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: