గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు తీవ్ర వ్యాఖ్యలు చేసారు. వంశీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని హెచ్చరించారు. అందరి భవిషత్తును ప్రజలు నిర్ణయిస్తారన్న ఆయన... అంతవరకు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిదని సూచించారు. ప్రజలంతా గమనిస్తున్నారన్న ఆయన... వంశీ ధైర్యవంతుడైతే రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటెందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. 

 

తెలుగుదేశం పార్టీని తిట్టడమే పనిగా పెట్టుకున్న వంశీ తన ఓటును చెల్లకుండా ఎందుకు చేసుకున్నారని నిలదీశారు. వంశీ టీడీపీకి రాజీనామా చేయలేదన్నారు. పార్టీయే వంశీని సస్పెండ్ చేసిందని పేర్కొన్నారు ఆయన. వంశీని రెండు సార్లు శాసనసభ సభ్యుడిగా గెలిపించింది టీడీపీనేనని పేర్కొన్నారు. వైసీపీలోకి వెళ్ళిన తర్వాత టీడీపీ మునుగుతుంది అని తెలిసిందా అంటూ నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: