తమిళనాడు లో కరోనా కేసులు ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కరోనా కట్టడికి చర్యలను వేగంగా అక్కడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా సరే కేసులు మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా కేసులు అక్కడ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా అక్కడ భారీగా కేసులు నమోదు అయ్యాయి. 

 

తమిళనాడులో 2396 తాజా కేసులు & 38 మరణాలు నమోదయ్యాయి, మొత్తం కేసుల సంఖ్య 56845 కు చేరుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో 24822 క్రియాశీల కేసులు ఉన్నాయని అక్కడి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మరణాల సంఖ్య 704 కి చేరుకుందని తెలిపింది. పరీక్షలు 33231 నమూనాలను గత 24 గంటల్లో పరీక్షించారు అక్కడ. ఇదే ఇప్పటి వరకు కరోనా పరిక్షల రికార్డ్ ఆ రాష్ట్రంలో గాని దేశంలో గాని.

మరింత సమాచారం తెలుసుకోండి: