భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. రెండు దేశాలతో తాము మాట్లాడుతున్నామని అసలు ఎం జరుగుతుందో చూద్దాం అంటూ ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ర్యాలీ కోసం వెళ్తూ ఆయన మాట్లాడారు. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితని అన్నారు. మేము భారత్‌తో మాట్లాడుతున్నామన్నారు ఆయన. చైనాతో చర్చలు జరుపుతున్నామని...

 

వాళ్లు చాలా పెద్ద సమస్య ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇరువురి మధ్య ఘర్షణ జరిగిందన్న ట్రంప్... ఈ సమస్య నుంచి బయట పడేందుకు వారికి మేము సహకారం అందిస్తామని... ఏం జరుగుతుందో చూడాలన్నారు. ఇక ఆయన భారత్ కి చైనా విషయంలో కొన్ని రోజుల నుంచి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయితే చైనా ట్రంప్ జోక్యాన్ని సహించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: