అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపధ్యంలో దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు యోగాసనాలు వేస్తున్నారు. సిఎం ల నుంచి ప్రతీ ఒక్కరు రాష్ట్రాల్లో యోగా వేడుకలను నిర్వహిస్తున్నారు. తాజాగా తెలంగాణా ఆర్ధిక శాఖా మంత్రి హరీష్ రావు తన నివాసంలో యోగా చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా జీవితంలో ఒక భాగం కావాలని అన్నారు.
ప్రతీ రోజు యోగా సాధన చేస్తే రోగాలను నిలువరించవచ్చని చెప్పారు. తాను ప్రతీ రోజూ యోగా సాధన చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రజలు అందరికి కూడ ఆయన యోగా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. తన నివాసంలో ఆయన యోగాసనాలు వేస్తూ ఉన్న ఫోటో లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇతర మంత్రులు కూడా యోగాసనాలు వేస్తున్నారు.
అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతీ ఒక్కరి జీవితంలో యోగా భాగమవ్వాలి.. ఆరోగ్య సమాజం నిర్మాణంలో అందరూ భాగస్వాములవ్వాలి.#YogaForLife pic.twitter.com/2FWrBP7v6S
— harish rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) June 21, 2020